ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > తిరుపతి మహిళా సదస్సుకు భారీగా ఏర్పాట్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తిరుపతి మహిళా సదస్సుకు భారీగా ఏర్పాట్లు
తిరుపతిలో ఈ నెల 11న జరుగనున్న మహిళా సదస్సుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు పాల్గొంటున్న ఈ సదస్సుకు చిత్తూరు జిల్లా నుంచే దాదాపు రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు.

తిరుపతిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాలు తెలిపారు. సోనియా గాంధీ ఇకపై తరచుగా రాష్ట్రంలో పర్యటించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 45 రోజులకు ఒకసారి ఆమె రెండు జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు.

ఈ మహిళా సదస్సు అధికార కార్యక్రమం కావడం చేత పార్టీ కార్యకర్తలు హాజరుకారని తెలిపారు. వేదికపై తనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, సంబంధిత మంత్రులు మాత్రమే ఉంటారని చెప్పారు.
మరిన్ని
నెమలి వాహనంపై వరసిద్ధి వినాయకుడు
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
అక్టోబర్ 21 వరకు కల్యాణమస్తు గడువు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అధికారుల సమీక్ష  
భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు  
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గద్వాల పంచెలు