తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు ఆదివారం బంగారు హస్తాలను సమర్పించుకున్నాడు. బెంగళూరుకు చెందిన కమల్కడియా రూ.15 లక్షలతో నాలుగు హస్తాలను చేయించాడు.
ఇందులో ఒకటి అభయహస్తం కాగా, మరొకటి వరదహస్తం, రెండు కమల హస్తాలు, వెంకటేశ్వర స్వామి డాలర్తో కూడిన చైన్లు ఉన్నాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆభరణాలను ఆదివారం ఉదయం ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో చెంగల్రాయులకు దాత అందించారు. ఈ హస్తాలను అమ్మవారి ఉత్సవమూర్తులకు అలంకరించనున్నట్టు ఆలయ అధికారులు చెప్పారు.
|