తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వినాయకుడి లడ్డు రూ. 2 లక్షల 7 వేలు పలికింది. తిరుపతికి చెందిన భాను బిల్డర్స్ అధినేత గణపతి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు.
ఈ లడ్డును దక్కించుకున్న గణపతి వినాయక చవితి నాడే జన్మించడం విశేషం. అంతే కాదు ఈ లడ్డును ముగ్గురు ముస్లింలు తయారు చేశారు. లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బును అనాథ బాలలు, వికలాంగ బాలల కోసం ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
|