శ్రీవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ మంగళ కైశిక ద్వాదశి మహోత్సవం వైభవంగా జరుగనుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా... మంగళ ధ్వని, స్వామివారికి నిత్యార్చనం, శ్రీ వేంకటేశ్వర హోమాలను కూడా జరుగనున్నాయి. హరిదాస భాగవతులతో మంగళ కైశిక ద్వాదశి వ్రత కథాగానం, అన్నమాచార్య సంకీర్తనం, సమిష్టి గోవిందనామస్మరణం, సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించనుంది. ఇకపోతే.. రాష్ట్రంలో ఎంపిక చేయబడిన 108 దళిత వాడల్లో కార్తీక మాస శుక్ల ద్వాదశిన ఈ కార్యక్రమాన్ని తితిదే నిర్వహిస్తోంది. మాలదాసరులుగా పిలువబడే హరిదాస సంస్కృతి వైభవాన్ని చాటేందుకు గానూ... గత ఏడాది నుంచి టీటీడీ ఈ ఉత్సావానికి శ్రీకారం చుట్టింది. |