ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన సింహగిరిపై సుదర్శన నృసింహయాగం ఘనంగా ప్రారంభమైంది. లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ యాగం కోసం మొత్తం 11 యాగశాలల్లో 108 హోమగుండాలు ఏర్పాటు చేశారు. నృసింహ మహాయజ్ఞంలో భాగంగా... మొదట విశ్వక్సేనపూజలు, పుణ్యకవచంను నిర్వహించారు. యాగశాలలను మామిడి తోరణాలు, పూలదండలతో అలంకరించారు. సింహాచల ఆలయ ప్రధాన అర్చకులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞంతో సింహగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. అంతేకాకుండా వేదపండితుల మంత్రోచ్ఛారణతో సింహగరి మార్మోగుతోంది. |