కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు తెల్లవారు జామునే పుణ్యస్నానమాచరించి కైలాసనాధుడిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసం నిండు పౌర్ణమి ఘడియలలో బుధవారం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని దక్షిణ ద్వారం వద్ద జ్వాల తోరణం చూసి భక్తులు భక్తి పారవశ్యంలో తేలియడారు. ఇదిలా ఉండగా... దక్షిణభారతదేశంలోని ప్రసిద్ధి గాంచిన అంచటేశ్వరాలయం కార్తీక పౌర్ణమి పర్వదినంతో కిటకిట లాడింది. అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బుధవారం స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.దీపాలంకరణతో కళకళలాడిన అచంటేశ్వర స్వామి ఆలయంలో వేదపండితుల హోమానికి అనంతరం, కృత్తికా నక్షత్ర సమయాన సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇకపోతే... పంచారామ క్షేత్రాలు భక్త జన సందోహంతో నిండిపోయింది. |