కార్తీక పౌర్ణమి సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి అన్నాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీకమాసంలో ప్రతి ఏటా స్వామివారికి వైభవంగా అన్నాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అన్నాలంకృతుడైన బొజ్జప్పను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.బుధవారం ఉదయం మూలవిరాట్ట స్వామికి సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అన్నంతో దివ్య సుందరంగా అలంకరించారు. అలంకరణ తర్వాత వినాయక స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.అన్నాభిషేకం పూర్తయిన తర్వాత విఘ్నేశ్వరునికి ఘనంగా ఊంజల్ సేవ జరిగింది. సిద్ధి, బుధ్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకునిని సర్వాలంకరణాభూషితుడుగా అలంకరించి అన్వేటి మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. |