తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు సమీపంలోని ఉత్తిర మేరూర్లో వెలసిన బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 260 కిలోల వెండి రథం సిద్ధమైంది. చెన్నై నగరంలోని ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జీఆర్టీ నిర్వాహకులు ఈ వెండిరథాన్ని కుమారస్వామికి బహూకరించనున్నట్లు తెలిపారు.
ఈ రథాన్ని ఐదుగురు వడ్రంగులు, తొమ్మిది మంది స్వర్ణకారులు తయారు చేశారు. తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో ఈ వెండిరథం తయారైందని సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వెండిరథ తయారీకి రూ.50లక్షలు పైగా వ్యయమైందని సమాచారం. |