ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > భక్త వరాహం పోయి... భక్త గరుడుడొచ్చాడు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భక్త వరాహం పోయి... భక్త గరుడుడొచ్చాడు..!
FILE
కలియుగంలో వింతలు చోటుచేసుకుంటాయన్న ఆర్యుల మాటలు రోజురోజుకు నిజమౌతున్నాయి. ఇటీవలే ఓ భక్త వరహం సిద్ధాంతం గ్రామంలోని వెంకన్న ఆలయాన్ని రెండు రోజుల పాటు ప్రదక్షిణలు చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ గరుడుడు మరో వింతకు కారణమయ్యాడు.

అసలు విషయమేమిటంటే...? భక్తవరాహం లాగానే విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు... హైదరాబాద్ నగరం కందికల్‌గేట్‌లోని చిత్రగుప్త స్వామి దేవాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంపై ప్రదక్షిణలు చేస్తున్నాడట. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఓ గరుడపక్షి అయ్యప్ప ఆలయంపై ప్రదక్షిణలు చేపట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు భారీ ఎత్తున అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేశారు. ప్రదక్షిణలు చేసి చేసి అయ్యప్ప స్వామి ముందు వాలిన గరుడకు ప్రజలు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం గరుడపక్షిని ఆకాశంలోకి వదిలినా అది మళ్లీ అయ్యప్ప స్వామి ఆలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తోందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హమ్మయ్య.. భక్త వరాహం డిశ్చార్జ్ అయ్యింది!
తిరుమల గిరులపై పెరిగిన భక్తుల రద్దీ
2009 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన తితిదే
భజగోవిందం భక్తులకు ఉచిత మహాప్రసాదం
వచ్చే నెల 7న శ్రీవారికి స్వర్ణరథ సేవ
కల్యాణ వెంకన్నకు బంగారు కాసుల హారం