వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా సుప్రసిద్ధ శ్రీరామ దివ్యక్షేత్రం ముస్తాబవుతోంది. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నదిలో మంగళవారం స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ముందుగా స్వామివారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వైభవంగా జరుగనున్న ఈ తెప్పోత్సవం కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులు గోదావరి స్నానఘట్టాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్య సుందరంగా అలంకృతుడైన శ్రీరాముడు హంస వాహనంపై ఆసీనుడై, గోదావరిలో విహరించే వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.మరోవైపు ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని భద్రాచలం ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. |