సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కాళహస్తిలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరుగనుంది. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన రథోత్సవం, 25న కళ్యాణోత్సవం జరుగుతుంది. చివరిగా మార్చి రెండోతేదీన జరిగే ఏకాంత సేవతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.ఇదిలా ఉండగా... భక్తకన్నప్ప ధ్వజారోహణంతో శ్రీ కాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. భక్తకన్నప్పతో పాటు, స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కైలాసగిరుల మీద గల భక్తకన్నప్ప కొండమీదకు తీసుకెళ్లారు. అక్కడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. |