ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > భృంగివాహనంపై ఊరేగిన మల్లన్నస్వామి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భృంగివాహనంపై ఊరేగిన మల్లన్నస్వామి
FILE
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నాలుగో రోజైన గురువారం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై ఊరేగుతూ, భక్తులకు అభయప్రదానం చేశారు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను దివ్యసుందరంగా అలంకరించి, భృంగివాహనంపై అధిరోహింపజేసి, ఆలయ ప్రాంగణంలోని దక్షిణ ద్వారం వద్ద విశేష పూజలు నిర్వహించారు.

అనంతరం మల్లన్న ఆలయ వీధుల్లో విహరించారు. ప్రదక్షిణానంతరం భ్రమరాంబికాదేవీ సమేత మల్లన్న స్వామిని రథశాల వద్దకు చేర్చి, ప్రత్యేక పూజల అనంతరం గ్రామోత్సవం ప్రారంభమైంది. నందిమండపం, బయలు వీరభద్ర స్వామి ఆలయం వంటి తదితర ప్రాంతాల్లో స్వామివారిని ఊరేగించి, రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేర్చారు.

మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవీలు భృంగి వాహనంపై విహరించిన వైనాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు శ్రీశైలం చేరారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు.

ఇదిలా ఉండగా... బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం అశేష భక్త జనప్రవాహంతో కిటకిటలాడుతోంది. శివదీక్ష పూనిన భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి చేరుకుంటున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఘనంగా గంగమ్మ లక్ష కుంకుమార్చన
శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
మయూరవాహనంపై ఊరేగిన మల్లన్న
శ్రీకాళహస్తిలో ఘనంగా ధ్వజారోహణం
ప్రేమతో చేసే సేవలు అమూల్యమైనవి
మయూర వాహనంపై మల్లన్న విహారం