ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > వైభవంగా శ్రీకాళహస్తీశ్వర కళ్యాణోత్సవం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైభవంగా శ్రీకాళహస్తీశ్వర కళ్యాణోత్సవం
WD
శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవోపేతంగా ముగిసింది. గురువారం తెల్లవారుజామున జరిగే కళ్యాణానికి స్వామి, అమ్మవారు బుధవారం రాత్రి బయలుదేరారు. వధూవరులైన శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబలు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో, పట్టు పీతాంబర వస్త్రాలతో చక్కగా ముస్తాబై ఆలయం వెలుపలికి వచ్చారు.

కళ్యాణ మండపానికి వెళ్లేందుకు స్వామివారు గజవాహనంపై అధిరోహించగా, అమ్మవారు సింహవాహనంపై అధిష్టించారు. డప్పులు, ప్రమధ గణాలు, కోలాటాలు, వివిధ రకాల వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి అవసరమైన సామగ్రితో ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల వెంటనే వచ్చారు.

మరోవైపు కళ్యాణం చేసుకోనున్న సోదరి జ్ఞానప్రసూనాంబకు తిరుమల వెంకన్న బుధవారం సాయంత్రం సారె పంపారు. ఈ సారెను టీటీడీ తరపున తిరుపతి జేఈవో శేషాద్రి సాయంత్రం పట్టువస్త్రాలు, సుగంధ ద్రవ్యాలను తెచ్చారు. తిరుమల నుంచి వచ్చిన సారెకు కాళహస్తి ఆలయ అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు.

ఇకపోతే.. వివిధ రకాలపై పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించబడిన కళ్యాణమండపంలో గురువారం తెల్లవారుజామున శ్రీకాళహస్తీశ్వర-జ్ఞానప్రసూనాంబల కళ్యాణం వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణమహోత్సవంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు వందలాది పెళ్లి జంటలు సామూహిక వివాహాలు చేసుకున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శ్రీశైలంలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
వైభవంగా ముగిసిన రథోత్సం
భక్తులతో పోటెత్తిన వనదుర్గామాత ఆలయం
మార్చి 6 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
శ్రీశైలంలో నేడే రథోత్సవం