ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > కదిరి నరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కదిరి నరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం
FILE
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. పుష్పయాగోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరుగనుంది. అనంతలోని కదిరిలో వెలసని నరసింహ స్వామికి, బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున ఈ పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. దీని ప్రకారం ఆలంయలోని యాగశాలలో శుక్రవారం రాత్రి ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ ఉత్సవానికి ఉభయదారులుగా పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే రాత్రి శ్రీవారిని ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ఏకాంత సేవ నిర్వహించనున్నారు.

ఇకపోతే.. ఉదయం నవ కలశ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే శ్రీ వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని ఆలయ నిర్వాహకులు అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శ్రీవారి లడ్డూకు త్వరలో పేటెంట్ హక్కులు..!
భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు
27న వెంకన్న ఆలయంలో ఉగాది ఆస్థానం
కళ్యాణ వెంకన్న ఆలయంలో పుష్పయాగం
23 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు
కన్నుల పండుగగా అప్పన్న డోలోత్సవం