శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, యాత్రికుల కోసం అధునాతన సదుపాయాలని కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శాఖ ఎండీ బి. వెంకటేశం తెలిపారు. దర్శనమయ్యేలోగా తిరుపతిలోని అన్ని ఆలయాల సందర్శనకు వీలుగా శ్రీనివాసమంగాపురం నుంచి అలిపిరి వరకు 50 అడుగుల ఎత్తులో రోప్వేను ఏర్పాటుచేస్తామని ఆయన వెల్లడించారు. ఆదివారం కలెక్టర్ శేషాద్రి అధ్యక్షతన తుడా, టూరిజం అధికారులతో నిర్వహించిన ఉన్నత సమావేశంలో వెంకటేశం మాట్లాడుతూ.. స్థానిక ఆలయాల సందర్శనకు వారం పదిరోజుల్లో ప్రత్యేక బస్సులు నడుపుతామని వెంకటేశం చెప్పారు. ఇకపోతే.. తిరుపతి పర్యాటకాభివృద్ధికి రూ. 45.61 కోట్లు వెచ్చించనున్నట్లు వెంకటేశం వెల్లడించారు. రాష్ట్ర పర్యాటక శాఖ, తుడాల సంయుక్త ఆధ్వర్వంలో ఈ నిధులను వ్యయం చేస్తారని ఆయన వివరించారు. |