ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
కట్టుదిట్టమైన భద్రతల నడుమ 132వ జగన్నాథ రథయాత్ర బుధవారం ఉదయం అలహాబాద్‌లో ప్రారంభమైంది. ఈ యాత్ర మూడు రోజులపాటు జరుగనుంది.

సాంప్రదాయబద్దంగా ఈ యాత్రకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు ఈ రథాన్ని లాగారు. ఈ రథంలో జగన్నాథుడు, బలరాముడు మరియు వారి సోదరి సుభద్రల విగ్రహాలను అంగరంగవైభవంగా అలంకరించి ప్రతిష్టించియున్నారు.

ఈ రథయాత్రను అలహాబాద్‌లో ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుపుతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోడీ తెలిపారు. రథయాత్రలో భాగంగా పద్దెనిమిది ఏనుగులతోపాటు అలంకరించిన మరో 98 ట్రక్కులు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.

ఆ దేవదేవుడు జగన్నాథుని రథాన్ని లాగేందుకు ప్రజలు అత్యధిక సంఖ్యలో వివిధ ప్రాంతాలనుంచి అలహాబాద్‌కు తరలి వచ్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పోలీసుబలగాలు మొహరించి భద్రతా చర్యలను చేపట్టారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వెంకన్నకు కానుకగా స్వర్ణపాత్ర
25నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం
శ్రీనివాసమంగాపురం నుంచి అలిపిరికి రోప్‌వే
శ్రీవారిపై స్వరార్చనకు రంగం సిద్ధం?
భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీవారి ఆలయం
2010లో మహాకుంభమేళా