తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం ఈ నెల 22న మూతపడనుంది. ఈ నెల 22న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆ రోజున తెల్లవారుజాము 5.30 నుంచి 8.30 గంటల మధ్య సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ముందురోజు (21వతేదీ) రాత్రి 10 గంటలకు నివేదన, ఏకాంతసేవ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాక ఆలయాన్ని మూసివేస్తారని, తిరిగి బుధవారం (22వతేదీ) ఉదయం 10 గంటలకు శుద్ధి, పుణ్యాహవచనం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి శ్రీవారి ఆలయ తలుపులు తెరుస్తారని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. |