ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కలిగిన తిరుపతి-శ్రీకాళహస్తిల మధ్య ఆర్టీసీ ప్రయాణ ఛార్జీని పెంచింది. రేణిగుంట సమీపంలో ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తుండటంతో బైపాస్ రోడ్డు మీదుగా శ్రీకాళహస్తికి వెళ్లాల్సి ఉంది.
సాధారణం కంటే.. మూడు కిలోమీటర్ల దూరం పెరగడంతోనే రెండు రూపాయలను అదనంగా పెంచినట్లు ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దీంతో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో రూ. 17 నుంచి రూ.19కి, అలాగే శ్రీకాళహస్తి ఆర్డినరీ సర్వీసుల్లో రూ.16 నుంచి రూ. 18కి పెంచినట్లు ఆర్టీసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.