తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం, రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన కరీరిష్టి యాగం ఆదివారం పూర్ణాహుతితో సమాప్తమైంది. పంచవృత దీక్షతో నిర్వహించిన ఈ యాగంలో నలుగురు ప్రధాన రుత్వికులు, ఓ యజమాని దంపతులు పాల్గొన్నారు.
పార్వేట మండపం వేదికగా ఐదు రోజులపాటు చిర్రావూరి శ్రీరామశాస్త్రి ఆధ్వర్యాన ఈ యాగం సాగింది. ప్రతి ఏటా అవసరమైన మేర వర్షాలు కురిసేలా వరుణుడిని ఆవాహన చేయడమే ఈ కత్రువు ధ్యేయమని పండితులు చెప్పారు.
తిరుమలలో గత నాలుగేళ్లుగా ఈ క్రతువు కొనసాగుతోందని టీటీడీ ఛైర్మన్ అన్నారు. ఈ ఏడాది రుతుపవనాల సంచారం సవ్యంగా లేక వర్షాలు కురవకపోవడంతో, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ ఈ యాగాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.