కలియుగ వైకుంఠధామం శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత కోసం అక్టోపస్ యూనిట్ను డీజీపీ యాదవ్ శనివారం ప్రారంభించారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు తరలివచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తితిదే అధికారుల అంచనా వేస్తోన్న నేపథ్యంలో.. అక్టోపస్తో అదనపు భద్రతను ఏర్పాటు చేశామని డీజీపీ యాదవ్ విలేకరులతో అన్నారు.
ఈ యూనిట్లో 200 మంది కమాండోలు ఉంటారని, మొదటిగా 46మందితో యూనిట్ ప్రారంభమైందని, వీరు నిరంతరం తిరుమలలో భద్రతను పర్యవేక్షిస్తుంటారని యాదవ్ తెలిపారు. త్వరలో మరో రెండు అక్టోపస్ యూనిట్లు ప్రారంభమవుతాయని యాదవ్ అన్నారు.