హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » మంగళసూత్రాలకు తిరుమలలో పూజలు (Tirumala Tirupati Devastanams| Kalyanamastu| Mangalsutra| Anjaneya Swamy)
Feedback Print Bookmark and Share
 
Venky
WD
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కళ్యాణమస్తు కార్యక్రమంలో వినియోగించే మంగళసూత్రాలకు తిరుమలలో ప్రత్యేక పూజలు జరిపారు.

బుధవారం టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో తదితరులు మంగళసూత్రాలను బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి సన్నిధికి చేర్చారు. వాటిని మూలవర్ల పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించాక ఆస్థాన మండపానికి తరలించారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని కళ్యాణ వేదికలకు పంపించారు.

ఇకపోతే.. కళ్యాణమస్తు కార్యక్రమంలో పెళ్ళిళ్లు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు. ఈ నెల 26వరకు వధూవరులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఛైర్మన్ ఆదికేశవులు తెలిపారు. కళ్యాణమస్తు ముహూర్తం విషయంలో వస్తున్న విమర్శలలో నిజం లేదన్నారు. ఇప్పటివరకు 2600 దరఖాస్తులు అందాయన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.