హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » మంత్రాలయం పుణ్యక్షేత్రంపై ప్రత్యేక దృష్టి: రోశయ్య (Mantralayam| Religion| News| Chief Minister| K. Rosaiah| Flood| Karnataka| Yeddyurappa| Bangalore)
Feedback Print Bookmark and Share
 
K. Rosaiah
FILE
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు.

వరదల వల్ల కర్నూలు జిల్లాలోని మంత్రాలయం క్షేత్రం తీవ్రంగా దెబ్బతిందని, ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుయతీంద్ర తీర్థకు రోశయ్య హామీ ఇచ్చారు.

శుక్రవారం బెంగళూరు పర్యటన సందర్భంగా.. రోశయ్య ఎయిర్‌పోర్ట్ నుంచి నేరు గా టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సుయంతీంద్ర తీర్థ కూడా అక్కడే ఉండటంతో ఆయన ఆశీస్సులను కూడా ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రాలయం ఇంకా బురదమయంగానే ఉందని, దాన్ని బాగుచేయాలని స్వామి కోరారు.

ఇంకా కర్ణాటక నుంచి మంత్రాలయానికి ప్రధాన అనుసంధాన మార్గమైన మాధవరం వంతెనను పునరుద్ధరించాలని యడ్యూరప్ప కోరినట్లు తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.