హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Kaisika Dwadasi Astana| Karthika Masam| Srinivasa)
Feedback Print Bookmark and Share
 
Govinda
WD
తిరుమలలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వైభవంగా ముగిసింది. కార్తీకమాసంలో వచ్చే తొలి ద్వాదశి రోజున కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ.

ఇంకా తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే ఈ వేడుకను పూర్తి చేయడం మరో ప్రత్యేకత. ఇందులో భాగంగా.. శుక్రవారం ఉభయ నాంచారుల సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని దివ్య సుందరంగా అలంకరించి తిరుమాడవీధుల్లో ఊరేగించారు.

తెల్లవారుజామున మొదలయ్యే ఈ వేడుకలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే.. వేడుకలో పాల్గొనే ఉగ్ర శ్రీనివాసునిని భరించడం కష్టమని పండితులు అంటారు. అందుకే సూర్యోదయానికి ముందే స్వామివారిని తిరుమాడవీధుల్లో ఊరేగించి.. ఆలయంలోకి వేంచేపు చేస్తారని వారు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.