హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » చదువుల తల్లిగా దర్శనమిచ్చిన పద్మావతీ దేవి (Padmavathy| Saraswathi Devi| Tiruchanur| Devotees| Hamsa Vahanam)
Feedback Print Bookmark and Share
 
FILE
తిరుచానూరులో వెలసిన పద్మావతీ దేవి చదువుల తల్లిగా దర్శనమిచ్చారు. తిరుచానూరులో జరుగుతోన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చేత వీణ పట్టి చదువుల తల్లి సరస్వతిదేవి అవతారంలో ఇచ్చారు.

శనివారం సాయంత్రం ఊంజల్‌సేవలో భక్తులను కనువిందు చేసిన పద్మావతీ దేవిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకెళ్లారు. అనంతరం వజ్రవైఢూర్యాదులతో సరస్వతీ దేవీగా దివ్యసుందరంగా అలంకృతమైన పద్మావతీ దేవిని సవాహనంపై అధిష్టింపజేశారు.

వీణాపాణియై హంసవాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని వేలాది మంది భక్తులు తిలకించి, భక్తిపారవశ్యంలో మునిగి తేలారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.