హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » తిరుచానూరులో కన్నుల పండుగగా రథోత్సవం (Padmavati Devi| Tiruchanur| Devotees| Radotsavam| Suryaprabha Vahanam| Religion| News)
Feedback Print Bookmark and Share
 
FILE
తిరుచానూరులో జరుగుతోన్న పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం వైభవోపేతంగా జరిగింది.

సర్వాంగసుందరంగా అలంకరించిన అమ్మవారిని రథంపై అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగించారు. రథంపై అధిష్టించి భక్తులకు అభయమిస్తూ.. మాడవీధుల్లో ఊరేగిన అమ్మవారి శోభను తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

మరోవైపు.. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అమ్మవారు కల్కి అవతారంలో అశ్వవాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతారు.

ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం తిరుచానూరు పద్మావతీ అమ్మవారు సూర్యప్రభవాహనంపై ఊరేగారు. శ్రీమన్నారాయణుని అవతారంలో సూర్యప్రభవాహనంపై అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.