ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
K.Ayyanathan
WD PhotoWD
ఈ పవిత్ర పర్వతం చుట్టూ ప్రతి పౌర్ణమినాడు రెండు నుంచి మూడు లక్షల భక్తులు 14 కి.మీల మేర పాదరక్షలు లేకుండా ప్రదక్షిణం చేస్తారు. అంతేకాక సంవత్సరానికి ఒకసారి గిరి శిఖరంపై కనిపించే కార్తీక దీపాన్ని కనులారా వీక్షించేందుకు 10 నుంచి 15 లక్షల మంది ప్రజలు ఇక్కడకు చేరుకుంటారు.

హిందువులు పరమ పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినం ఈ పుణ్య స్థలంలోనే ఆవిర్భవించింది. పరమశివుని అవతారంగా భక్తులు భావించే 2,665 అడుగుల ఎత్తైన ఈ పర్వతం శ్రీ అరుణాచలేశ్వరునిగాను, తమిళులు భక్తిప్రపత్తులతో పిలుచుకునే తిరు అన్నామలైయార్‌గాను పేరొందింది.

'వెబ్‌దునియా' తీర్థయాత్రలో, తలచినంతనే ముక్తిని (మరుజన్మంటూ లేకుండా భగవంతునిలో ఐక్యతనొందడం) ప్రసాదించే పవిత్ర ప్రాంతంగా పురాణాలలో ప్రస్తావించబడిన తిరువన్నామలై పుణ్య పట్టణానికి మరియు పురాతనమైన దేవాలయానికి అంతేకాక పవిత్రమైన పర్వతానికి మేము మిమ్మల్ని తీసుకువెళుతున్నాము.

పరమ శివుని పంచభూత క్షేత్రాలలో ఒకటిగా శ్రీ అరుణాచలేశ్వర వాసికెక్కింది. ఇది మహాశివుని అగ్ని క్షేత్రం (కంచి మరియు తిరువారూర్ భూమి, చిదంబర
WD PhotoWD
ఆకాశం, శ్రీకాళహస్తి వాయువు, తిరువానైక జలం).

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహాశివరాత్రి
తన యొక్క ప్రాముఖ్యాన్ని బ్రహ్మ మరియు విష్ణువులకు తెలియచేసేందుకు మహోజల్వమైన అగ్ని రూపంలో మహా శివుడు ఇక్కడ అవతరించాడని శివపురాణం చెబుతున్నది. ఒకానొక సందర్భంలో తామిరువురిలో ఎవరు గొప్ప అనే వాదన బ్రహ్మ మరియు విష్ణువు మధ్య చోటు చేసుకుంది. తమ తగువు తీర్చవలసిందిగా వారిరువురు పరమశివుని కోరారు.
వీడియోను వీక్షించండి
  1 | 2 | 3 | 4  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం
ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం
నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం