తన శిరస్సు లేదా పాదాన్ని చూడగలిగినవారే గొప్పవారంటూ శివుడు వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. చూస్తుండగానే భూమి నుంచి ఆకాశాన్ని తాకే మహోజ్వలమైన జ్వాలారూపాన్నిసంతరించుకున్న గంగాధరుడు తన శిరస్సు లేదా పాదాన్ని కనుగొనవలసిందిగా వారిని అడిగాడు.
శివుని పాదాన్ని కనుగొనేందుకు వరాహావతారాన్ని ఎత్తి మహావిష్ణువు భూమిని తవ్వుతుండగా, శివుని శిరస్సును కనుగొనేందుకు హంస రూపాన్ని దాల్చిన బ్రహ్మదేవుడు ఆకాశంలో సంచరించనారంభించాడు. ఓటమిని అంగీకరించిన శ్రీమహావిష్ణువు వెనుకకు తిరిగివచ్చాడు. అలసటనొందిన బ్రహ్మ దేవుడు ఆకాశం నుంచి నేలపైకి జారుతున్న పుష్పాన్ని (తాళమ్బు) చూసాడు.
ఎక్కడ నుంచి వస్తున్నావంటూ బ్రహ్మ ఆ పుష్పాన్ని అడుగగా, శివుని కేశాల నుంచి జారిపడిన తాను భూమిని చేరేందుకు యుగాల తరబడి ప్రయాణిస్తున్నట్లు సమాధానమిచ్చింది. అంతట ఒక ఉపాయం బ్రహ్మ దేవునిలో కలగడంతో తాను శివుని శిరస్సును చూసినట్లుగా శివునికి చెప్పవలసిందిగా బ్రహ్మదేవుడు ఆ పుష్పాన్ని అభ్యర్థించాడు.
అందుకు అంగీకరించిన పుష్పం శివునితో అసత్యమాడింది. అసత్యానికి ఆగ్రహించిన శివుడు భూమిని ఆకాశాన్ని కలిపే అగ్ని స్థంభంగా అవతరించాడు. భరించలేని అగ్నికీలల తాలూకు వేడిమి భూమితో పాటు స్వర్గాన్ని తాకింది. శివుని దేహం నుంచి జారిపడిన ఇంద్రుడు, యమడు, అగ్ని, కుబేరుడు తదాది అష్టదిక్పాలకులు శాంతించవలసిందిగా పరమశివుని ప్రార్ధించారు. శక్తి మరియు సకల దేవాధిపతులు కూడా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనలను మన్నించిన మహాశివుడు జ్యోతి స్వరూపునిగా మారిపోయాడు. దైవిక సంఘటనతో మహాశివరాత్రి పర్వదినానికి అంకురార్పణ జరిగింది.
లింగోద్భవం!
అంతట అగ్ని రూపాన్ని ఉపసంహరించుకున్న మహాశివుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీ అరుణాచలేశ్వర లేదా తిరు అన్నామలైయార్గా అవతరించాడు. పాదం చెంత వరాహ రూపంలో భూమిని తవ్వుతున్న శ్రీమహావిష్ణువు మరియు పుష్పం జారిపడుతుండగా హంస రూపంలో బ్రహ్మతో అగ్ని రూపుడైన పరమశివుని శిల్పమే లింగోద్భవ వృత్తాంతాన్ని తెలియచెప్పేది. అంతేకాక ప్రతి శివాయంలోని గర్భగుడి గోడ వెనుక లింగోద్భవ ఘట్టాన్ని తలపించే శిలాకృతులు దర్శనమిస్తాయి. ఆవిధంగా మూలం ఈ ప్రాంతంలోనే ఉన్నది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|