దర్గా ప్రవేశానికి ఉద్దేశించిన దర్గాబజార్ ప్రధానమైన అంతర్ ఆవరణలోనికి దారి తీస్తుంది. దర్గాకు చెందిన వెండి ద్వారాలు అధ్బుతంగా రూపొందించబడ్డాయి. మతాచార్యుని సమాధిని ఆవరించినట్లుగా ఒక వెండి కంచె మరియు ఒక పాక్షిక చలువరాతి తెర ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకించిన ప్రార్ధనామందిరం కూడా ఇక్కడ ఉన్నది.
అజ్మీర్ షరీఫ్ దర్గా సందర్శనార్ధం ముస్లింలతోపాటుగా అన్యమతస్థులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తుంటారు. ఇక మొయినుద్దీన్ చిస్టీ పరమపదించిన రోజున అనగా ఉరుసు సమయంలో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది.
ఉరుసు చివరి మూడురోజులు కేవలం భారతదేశానికి చెందిన భక్తులనే కాక ఇతర దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు చెందిన భక్తులను సైతం ఆకర్షిస్తాయి. అజ్మీర్లోని దర్గా షరీఫ్కు విచ్చేసే భక్తులు రిక్త హస్తాలతో వెనుకకు వెళ్ళరని చెప్పబడింది. ప్రతి సందర్శకుని ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తమ కోరికలు తీరిన భక్తులు, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలోని పుణ్య సమాధికి చదర్ (వెల్వెట్ వస్త్రం), పుష్పాలు, ఐత్రా (సుగంధ పరిమళ ద్రవ్యాలు) మరియు చందనాన్ని సమర్పించుకుంటారు. మతాచార్యుని కీర్తిస్తూ ఖవ్వాలీ పాటలు పాడుతారు.
|