మతాచార్యుని సేవకులైన ఖదీమ్లు పర్యాటకులకు కావలసిన సదుపాయాలను సమకూరుస్తారు. రాజస్థాన్ను సందర్శించే దాదాపు ప్రతి పర్యాటకుని మజిలీలలో ప్రధానమైన మజిలీగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రఖ్యాతి పొందింది. ఈ దర్గాను సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు.
ఎలా సందర్శించాలి: రైలు ద్వారా: పశ్చిమ రైల్వే యొక్క ఢిల్లీ అహ్మదాబాద్ విభాగానికి చెందిన రైల్వే జంక్షన్ అయిన అజ్మీర్, రాజస్థాన్లోని ప్రధాన పట్టణాలకు అనుసంధానించబడింది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోడ్డు ద్వారా: జైపూర్ (135 కి.మీ.), జోధ్పూర్ (198 కి.మీ.) మరియు ఢిల్లీ (335 కి.మీ.) నుంచి మీకు బస్సులు లభిస్తాయి. ఉరుసు సమయంలో దేశంలోని అన్ని నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపబడతాయి.
పదకోశం: దర్గా - పుణ్య సమాధి.
|