ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'
WD PhotoWD
ప్రత్యేక ఆకర్షణలు- నవరాత్రిని పురస్కరించుకుని వచ్చే తొమ్మిది రోజుల్లో, దేవాలయపు ముందు భాగంలో పూజలు మరియు నృత్యాలు చోటు చేసుకుంటాయి. ఈ పండుగను పురస్కరించుకుని గుజరాత్‌లోని రైతులందరూ తమ కుటుంబసమేతంగా దేవాలయానికి విచ్చేస్తారు. సాయం సమయాన జరిగే భారీ ఉత్సవంలో, భావై ప్రదర్శనలతో పాటు గర్బ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అమ్మవారిని స్తుతించేందుకు ఉద్దేశించిన 700 పద్యాలతో కూడిన సప్తశతిని భక్తులు సామూహికంగా పఠిస్తారు.

భాద్రపద పౌర్ణమి నాడు ఇక్కడకు విచ్చేసే భక్తులు రెండు మైళ్ళ దూరంలోగల గబ్బర్‌గథ్ పేరుతో పిలవబడే చిన్న పర్వతాన్ని సందర్శించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ప్రకృతి పట్ల తమకు గల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ పర్వతంపైన గల రావిచెట్టుకు భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు. గుజరాత్ సాంప్రదాయ రీతిలో పుష్పాలంకృతురాలైన దేవతామూర్తికి భక్తులు శిరస్సు వహించి నమస్కరిస్తుంటారు.

WD PhotoWD
ప్రతి మాసం పౌర్ణమి మరియు చంద్రుడు కొత్తగా సాక్షాత్కరించే అష్టమి రోజుల్లోను పలు రకాలైన ప్రత్యేక పూజలను అమ్మవారికి చేస్తారు. కనుక, ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేకమైనదే, అంతేకాక ఈ పవిత్రధామంలో ప్రతి క్షణం పరమపవిత్రమైనదై ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతున్న వైనం చూసి తరలించవలసిందే కానీ మాటలలో వర్ణించడం కవులకైనా అసాధ్యమే.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంబాజీకి చేరుకోవడమెల
ఎక్కడ నుంచి ఎంత దూరం:

అహ్మదాబాద్ నుంచి - 180 కి.మీ.లు
అబూ రోడ్ స్టేషన్ నుంచి - 20 కి.మీ.లు
మౌంట్ అబూ నుంచి - 45 కి.మీ.లు
న్యూఢిల్లీ నుంచి - 700 కి.మీ.లు
దగ్గరలోని స్టేషన్ - అబూ రోడ్
దగ్గరలోని విమానాశ్రయం - అహ్మదాబాద్
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా
శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం
జైన శిల్పాకృతికి ప్రతీక శ్రీ మహావీర్‌ ఆలయం
ఇరువురు దేవతలతో కొలువైన సిద్ధివినాయకుడు
కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!