పుణ్యక్షేత్రాలు
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » తీర్థయాత్ర » పుణ్యక్షేత్రాలు » కొండపై నిండుగా కొలువైన మాతల్లి కనకదుర్గా నీకు జేజేలు (Vijayawada Kanakadurga | Jai kanakadurga | Durga mata)
 
అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింద్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేశితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసుర మర్థిని రమ్యకపర్థిని శైలసుతే

భక్త జనకోటి చేస్తున్న దేవీస్తోత్ర పాఠాలతో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆపాదించుకుంటున్నది. శ్రీ కనకదుర్గ దేవాలయాన్ని చేరుకోవడానికి మెట్లు మరియు ఘాట్ రోడ్ సౌకర్యం కలదు. కానీ మహిళలకు, పిల్లలకు కష్టసాధ్యమైన మెట్ల ద్వారా దేవాలయాన్ని చేరుకోడానికి భక్తులు ఇష్టపడతుంటారు. కొందరు ఈ రెండు మార్గాలను వదిలి నేరుగా కొండను ఎక్కి అమ్మవారి సన్నిధిని చేరుకుంటారు. మెట్లపూజలో భాగంగా పసుపు, కుంకుమలతో భక్తులు మెట్లను అలంకరిస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంధ్రులకు ఆదిదేవతగా ఇంద్రకీలాద్రి పర్వతంపై అవతరించిన కనకదుర్గేశ్వరి తల్లి శతాబ్దాల కాలంగా లక్షలాదిమంది భక్తులను తన సన్నిధికి రప్పించుకుంటున్నది. అమ్మవారి ఆశీస్సులను అందుకునేందుకు సంవత్సరం పొడవునా భక్తులు దేవాలయానికి వస్తుంటారు. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు నవరూపాలలో కనిపించే దేవీమాతకు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు.

పవిత్రమైన కృష్ణానదీ జలాలకు చేరువలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై అతిపురాతనమైన కనకదుర్గ దేవాలయం నిర్మితమై ఉన్నది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం స్వయంభువుగా వెలసింది. కనుక అత్యంత మహిమాన్వితురాలిగా కనకదుర్గ తల్లి కొలవబడుతున్నది.
Srichakrapuja
WD PhotoWD


ఈ ప్రాంతంలోనే పాండవ మధ్యముడైన అర్జునుడు ఘోరతపస్సును ఒనరించి పరమశివుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇక్కడి దుర్గాదేవి ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడని తెలుస్తోంది. అలాగే ఈ దేవాలయాన్ని దర్శించుకున్న ఆది శంకరాచార్యుడు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా వేదసహితంగా దుర్గాదేవికి పూజలు నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడని చెప్పబడింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.