పుణ్యక్షేత్రాలు
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » తీర్థయాత్ర » పుణ్యక్షేత్రాలు » జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ
 
Mahishasuramardhini
WD PhotoWD
విజయదశమినాడు ఉత్సవమూర్తులు హంస రూపంలోని పడవపై కృష్ణానదిలో సాగించే తెప్పోత్సవంలో జగన్మాత వైభవాన్ని కనులారా వీక్షించవలసిందే. పదములకు అందని అద్భుతమైన ఘట్టమది.

అమ్మవారి కరుణాకటాక్షవీక్షణాలకోసం దేవాలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతున్నది. దేవస్థానం వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ. 40 కోట్లకు చేరుకున్నది. అనేక శక్తి మహిమలు, శివలీలలు ఇంద్రకీలాద్రి పర్వత ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయని పురాణాలు, పవిత్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గలగల పారుతున్న కృష్ణవేణి నదీమతల్లి అల్లంతదూరాన ఉండగా భక్తుల పాలిట కొంగుబంగారమై ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గాదేవి తన చల్లని చూపులతో భక్తులను కాపాడుతూ కలియుగంలో వారి కష్టాలను తీర్చే కల్పతరువుగా పూజలను అందుకుంటున్నది.
Devotees at the Temple
WD PhotoWD


చేరుకునే మార్గం:
విజయవాడ నగరంలో ప్రధానమైన ప్రాంతంలో గల దేవాలయానికి విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి పది నిమిషాలలో చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌కు విజయవాడ నగరం 275 కి.మీ.ల దూరంలో ఉన్నది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మరియు విమానమార్గం ద్వారా విజయవాడకు చేరుకోవచ్చు.