దేవాలయంలో ప్రతి దినం వేలసంఖ్యలో భక్తులకు అన్నదానం జరుగుతుంటుంది. ఇక దేవాలయం వెలుపల, పశ్చిమ వీధిలో త్రయంబకేశ్వరుడు, ఈశ్వరుడు, శృంగేరీ, మరియమ్మ దేవాలయాలు కనిపిస్తాయి. అనేక ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ జయేంద్ర సరస్వతి వేదాధ్యయన కేంద్రంలో విద్యార్థులు వేదాలలో ఉచిత శిక్షణ పొందవచ్చును.
దేవాలయ పర్వదినాలు: విద్య దశమితో పాటు చంద్రమాన ఉగాది, శ్రీరామనవమి, నవరాత్రి, సౌరమాన ఉగాది, మూకాంబికా జన్మాష్ఠమి, వినాయక చవితి, కృష్ణాష్ఠమి, నరక చతుర్దశి పర్వదినాలను దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తారు.
కొల్లూర్ చేరుకునే మార్గం: బెంగుళూరు నుంచి - 500 కి.మీ. మంగుళూరు నుంచి - 135 కి.మీ. ఉడిపి నుంచి - 35 కి.మీ. కుండాపూర్ నుంచి - 40 కి.మీ. ప్రయాణ మార్గాలు - రోడ్డు, రైలు, విమానం మరియు సముద్ర మార్గం సమీప రైల్వే స్టేషన్ - కొండాపూర్ సమీప విమానాశ్రయం - మంగళూరు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వసతి సౌకర్యం: తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా యాత్రికులు యాత్రీ నివాస్లో బస చేయవచ్చును.
రచన: నాగేంద్ర ట్రసీ ఫోటోగ్రాఫర్: సంతోష్ కుండేశ్వర్
|