వానరాన్ని పోలినట్లుగా నిర్మితమైన మారుతి అరుదైన విగ్రహాన్ని ఈ ప్రదర్శనశాలలో చూడవచ్చు. మరొక విగ్రహంలో చేతులలో పతాకాన్ని ధరించి, ఒంటెను అధిరోహించియున్న పవనసుతుని దర్శించుకోవచ్చు. ఇక బాలహనుమానుని సుందర మానుష విగ్రహం అద్భుతమైన భక్తిభావనను సందర్శకులలో రేకెత్తిస్తుంది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామిపై వెలువడిన రచనల భాండాగారాన్ని సునీల్ ఈ ప్రదర్శనశాలలో నెలకొల్పారు. ప్రచురణల సంస్థకు చెందిన సునీల్, ఏడవ తరగతి చదువుతండగానే ఆంజనేయ స్వామి ప్రభావానికి లోనయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం ముక్కు నుంచి రక్తం కారడంతో అతని జీవితం మరో మలుపు తిరిగింది. ప్రదర్శనశాలతో పాటు 'జై భజరంగ్' పేరిట దాతృత్వ సంస్థను సునీల్ స్థాపించారు.
అంతటితో ఆగక హనుమంతునిపై తాను రచించిన సాహిత్యాన్ని నాలుగు పుస్తకాల రూపంలో సునీల్ ప్రచురించారు. వాటిలో 'తులసీదాస్ హనుమాన్ సాధన శబ్దమణి' అత్యధిక అమ్మకాలకు నోచుకుంది. అంతటి ప్రజాదరణ పొందిన రచనలలో 'హనుమాన్ దర్శన్', 'సుందర కాండ సుందర్ క్యోం', 'భక్తోం కా దృష్టికోణ్ అండ్ వరల్డ్ ఆఫ్ లార్డ్ హనుమాన్' తలమానికంగా నిలుస్తున్నాయి.
హనుమత్ భక్తులకు సునీల్ ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నారు. ఆంజనేయ స్వామికి చెందిన వస్తువులు లేదా సమాచారాన్ని తనకు పంపవలసిందిగా ఆయన భక్తులను అభ్యర్థిస్తున్నారు. తన ప్రదర్శనశాలలో వాటి బాగోగులను చూసుకుంటానని సునీల్ హామీ ఇస్తున్నారు. రామభక్త హనుమాన్ ప్రదర్శనశాల ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.
ప్రదర్శనశాల చిరునామా: భజరంగ్ నికుంజ్, 14/1192, ఇందిరా నగర్, లక్నో. ఫోన్ నెం: 0522-2711172, మొబైల్ నెం: 09415011817
రచన.. అరవింద్ శుక్లా, లక్నో.
|