శ్రీ హర్మందిర్ సాహిబ్, శ్రీ దర్బార్ సాహిబ్ లేదా స్వర్ణదేవాలయం (దేవాలయ సౌందర్యం మరియు బంగారు పూతను దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల భాషలో మాట్లాడే ప్రజలు పిలుచుకునే పేరు)గా పిలవబడే ఈ దేవాలయం, దేవాలయపు దేవుడు హరి (దైవం) పేరిట నామకరణం గావించబడింది. ప్రపంచంలోని సిక్కులందరూ, ప్రతి రోజూ శ్రీ అమృత్సర్ను సందర్శించి శ్రీ హర్మందిర్ సాహిబ్కు పూజలు చేయాలని మనసావాచాకర్మణా ఆకాంక్షిస్తుంటారు.
ఫోటోగ్యాలెరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిక్కులు ప్రార్ధనలు జరిపేందుకు అవసరమైన ఒక కేంద్రాన్ని నెలకొల్పాలనే తలంపు ఐదవ సిక్కు గురువైన గురు అర్జున్ సాహిబ్ మనోఫలకంలో మెదిలింది. తలచిందే తడువుగా స్వంతంగా శ్రీ హర్మందిర్ సాహిబ్ దేవాలయ నిర్మాణ ప్రణాళికను, భవన ఆకృతిని ఆయన స్వంతంగా రూపొందించారు. ప్రారంభంలోనే పవిత్ర సరోవరాన్ని (అమృత్సర్ లేదా అమృత్సర్ అనగా అమృత కొలను) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మూడవ సిక్కు గురువు అమర్దాస్ సాహిబ్ తిరస్కరించారు.
కానీ బాబా బుద్ధజీ పర్యవేక్షణలో గురు రామదాస్ సాహిబ్ సమ్మతితో పవిత్ర సరోవరం రూపుదిద్దుకుంది. చెల్లింపుల ద్వారా స్థానిక గ్రామాల భూస్వాముల నుంచి సేకరించిన విరాళాలతో తొట్టతొలి గురు సాహిబ్లు, ప్రార్ధన కేంద్రానికి అవసరమైన భూమిని సముపార్జించారు. పట్టణ రూపకల్పనకు సైతం ప్రణాళిక రూపొందిచబడింది. తదనుగుణంగా, క్రీ.శ 1570 సంవత్సరంలో అమృతసరోవరం మరియు పట్టణ నిర్మాణ కార్యక్రమం ఏకకాలంలో ప్రారంభమయ్యింది. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు క్రీ.శ 1577నాటికి పూర్తయ్యాయి.
|