ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
డాకోర్‌లోని రంఛోడ్‌రాయ్‌జీ దేవాలయం
WD PhotoWD
గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో డాకోర్ ఉన్నది. మహాశివుని డంక్‌నాథ్ దేవాలయం ఇక్కడ ఉండటంతో డాకోర్‌, డంకాపూర్‌గా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 1722 సంవత్సరంలో శ్రీకృష్ణుడు కొలువైన రంఛోడ్‌రాయ్‌జీ దేవాలయం నిర్మాణంతో ప్రముఖ పుణ్యక్షేత్రంగా డాకోర్ వాసికెక్కింది.

మధురలో జరాసంధునితో యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడు యుద్ధక్షేత్రం నుంచి పారిపోవడంతో శ్రీకృష్ణునికి రంఛోడ్ అనే పేరు సార్థకమయ్యింది. ద్వారకలోని ద్వారకాదీశుని దైవత్వాన్ని సంతరించుకున్న రంఛోడ్‌జీ విగ్రహం కూడా నల్లరాయితో నిర్మితమైనదే. దర్శనానికి వచ్చే భక్తులు, విగ్రహం పాదం తాకడానికి
WD PhotoWD
అనుమతించబడతారు. దేవాలయ సందర్శన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిస్తారు.


అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 06:45 గంటలకు మంగళహారతిని ఇస్తారు. భక్తుల సమక్షంలోనే రంఛో‌డ్‌జీ అలంకరించబడతాడు. మంగళభోగ్, బాల్‌భోగ్, శ్రీనగర్‌భోగ్, గ్వాల్‌భోగ్ మరియు రాజ్‌భోగ్‌లతో ఉదయం పూట హారతిని ఇస్తారు. మధ్యాహ్న సమయాన ఉస్థపాన్‌భోగ్, శ్యామ్‌భోగ్ మరియు శక్తిభోగ్‌లతో హారతిని ఇస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీడియోను వీక్షించండి
  1 | 2  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
శ్రీ హర్‌మందిర్ సాహిబ్, స్వర్ణదేవాలయం  
లక్నోలో హనుమంతునికి ప్రదర్శనశాల  
సంగీత చక్రవర్తి- బట్టుక్ భైరవ్  
సర్వశక్తి స్వరూపిణి కొల్లూర్ మూకాంబికాదేవి  
జై కనకదుర్గ.. జై జై కనకదుర్గ  
భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'