గుజరాత్ రాష్ట్రంలోని ప్రధానమైన మూడు శక్తి పీఠాలుగా అరసుర్లోని అంబాజీ, చున్వల్కు చెందిన బాల మరియు చంపనేర్కు సమీపంలోని పావగఢ్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. కచ్లోని అసపురా, మౌంట్ ఆబూకు చెందిన అర్బుదదేవి, హల్వాడ్లోని సుందరీ, హర్సిద్ధికి చెందిన కోల్గిరి లేదా కోయ్లా మరియు నర్మదా తీరాన అనసూయలు గుజరాత్లోని ఇతర శక్తి పుణ్య క్షేత్రాలుగా భక్తుల పూజలను అందుకుంటున్నాయి. ఈ పావగఢ్... గుజరాత్కు ఒకప్పటి రాజధానిగా పేరొందిన చంపనేర్కు సమీపంలో వడోదరాకు 50 కి.మీ.ల దూరంలో పావగఢ్ శక్తి పీఠం నెలకొంది.
దక్షయజ్ఞ విధ్వంసం, శివుని రుద్ర తాండవం సందర్భంగా సతీ దేవీ దేహ భాగాలు భారతదేశంలోని పలు ప్రాంతాలలో పడ్డాయి. అటువంటి ప్రాంతాలు శక్తి పీఠాలుగా ప్రాచుర్యాన్ని పొందాయి. అదే సమయంలో సతీ దేవీ ఎడమ వక్ష భాగం ఇక్కడ పడిందని భక్తుల విశ్వాసం. వార్షిక నవరాత్రి ఉత్సవాలలో పర్వతంపై కొలువైన ఈ దేవాలయం భక్తులను పెద్దసంఖ్యలో ఆకర్షిస్తుంది.
ఏకాంతంగా కనిపిస్తూ, అన్ని వైపులా చల్లని గాలులను వెదజల్లే పర్వతంగా ప్రజలను ఆకట్టుకోవడంతో ఈ పర్వతానికి పావ్గఢ్ అనే పేరు సార్థకమయ్యింది. పురాణేతిహాసాలను అనుసరించి పావ్గఢ్ను ఆవరించిన లోయ విశ్వామిత్రుని శక్తితో నిండి ఉంటుంది. అంతేకాక ఇక్కడి కాళికా మాత విగ్రహాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. విశ్వామిత్రి నది ఇక్కడనే ఆవిర్భవించింది.
|