కైలాస పర్వతం మరియు పర్వత సానువులోని మానవ సరోవరానికి చెందిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బహుముఖమైంది. సర్వ మతాలకు చెందిన అన్ని వయస్సుల వారు వేర్వేరు మార్గాలలో ఈ ప్రాంతాన్ని పూజిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని బహుళ జనాదరణ పొందిన పురాణాలు మరియు కల్పనలు సర్వమత సమానత్వాన్ని మానవాళికి ప్రబోధిస్తుంటాయి.
మానస సరోవర దర్శనం...
మాంధాత మహారాజు మానస సరోవరం సరస్సును కనుగొన్నాడని చెప్పబడింది. మానవ సరోవరం ఒడ్డున గల అద్భుతమైన పర్వతాల సమీపంలో మాంధాత ఘోరమైన తపస్సు చేసినందున ఆ పర్వతాలకు మాంధాత నామం సంక్రమించింది. సరోవర మధ్య భాగంలో ఒక వృక్షం ఉందని బౌద్ధ మతస్తులు విశ్వసిస్తుంటారు. ఆ వృక్షానికి కాచే ఫలాలు శారీరక మరియు మానసిక రుగ్మతలను నయం చేస్తాయని వారి నమ్మకం. కైలాస పర్వత యాత్ర సాహస యాత్రకు ఏ మాత్రం తీసిపోనందున, అవాంఛనీయ సంఘటనలు, అనారోగ్య పరిస్థితులను యాత్రికులు చవి చూడవలసి వస్తుంది. సముద్రమట్టానికి సగటున 3500 మీటర్ల ఎత్తున ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో తగినంత ఆక్సిజన్ లభించదు కనుక తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, అసౌకర్యంగా అనిపించడం తదితర అనారోగ్య లక్షణాలు తలెత్తుతాయి. వీటిన్నిటికి విశ్రాంతికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. కొత్త వాతావరణానికి దేహ తత్వం తనను తాను మలుచుకుంటుందనే అంశాన్ని కొన్ని లక్షణాలు తెలుపుతుంటాయి.
|