కైలాస పర్వతాన్ని చేరుకునే మార్గం :
1) భారతదేశం నుంచి రోడ్డు ద్వారా : భారత ప్రభుత్వం మానవసరోవర సరస్సుకు యాత్రలు నిర్వహిస్తుంటుంది. ఈ యాత్రలో 28 నుంచి 30 రోజుల పాటు పర్వతాలపై కొనసాగుతుంది. యాత్రకు సంబంధించిన సీట్లు పరిమతమైనందున చాలా రోజుల ముందుగానే సీట్లను రిజర్వ్ చేసుకోవాలి. యాత్రలో పాల్గొనేవారిని డ్రా నిర్వహించడం ద్వారా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.
2) విమానం ద్వారా ఖాట్మండు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు ద్వారా కైలాస పర్వత దిగువభాగంలోని మానస సరోవర సరస్సును చేరుకోవచ్చు.
3) హెలికాఫ్టర్ ద్వారా : ఖాట్మండు నుంచి నేపాల్గంజ్ మరియు అక్కడి నుంచి సిమికోట్కు నిర్దేశిత వింగ్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. సిమికోట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా హిల్సా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ల్యాండ్ క్రూయిజర్ల ద్వారా మానససరోవరానికి చేరవచ్చు.
4) ల్హాసా గుండా ప్రయాణం : ఖాట్మండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి చైనా విమానం ద్వారా ల్హాసా చేరుకోవచ్చు. అక్కడి నుంచి టిబెట్లోని షిగెట్సె, గ్యాంట్సె, ల్హాట్సె, ప్రయాగ్ తదితరాల నగరాలను దర్శించుకుంటూ మానస సరోవరానికి చేరుకోవచ్చు.
|