పరమపవిత్రమైన మోహన్ఖేడా జైన తీర్ధం, ధార్కు 47 కి.మీ.ల దూరంలో ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది. పూజ్య గురుదేవ్ శ్రీ రాజేంద్ర సురీశ్వర్జీ మహారాజ్ సాహెబ్ 1940 సంవత్సరంలో ఈ తీర్ధాన్ని నెలకొల్పారు. ఈ తీర్ధంలో పద్మాసన భంగిమలోని భగవాన్ ఆదీశ్వర్ 16 అడుగుల విగ్రహం ప్రతిష్టించబడింది. అలాగే శ్రీ రాజేంద్ర సురీశ్వర్జీ, శ్రీ యతీంద్ర సురీశ్వర్జీ మరియు శ్రీ విద్యాచంద్ర సురీశ్వర్జీ మహరాజ్ సాహెబ్లకు చెందిన సమాధి మందిరాలు నిర్మించబడినవి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు, చైత్ర, పుష్య మాసాల సప్తమి రోజుల్లో ఇక్కడ తిరునాళ్ళ జరుగుతుంది.
ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన తిరునాళ్ళ నిర్వహించబడుతుంది. మాల్వా ప్రపంచంలో అవతరించిన పరమ పూజ్యులైన దాదా గురుదేవ్ ప్రభు శ్రీమద్ విజయ్ రాజేంద్ర సురీశ్వర్జీ తన బోధనలతో ఈ ప్రాంతానికి పవిత్రతను తీసుకువచ్చారు. 1940 సంవత్సరంలో రాజ్గఢ్కు పశ్చిమంగా శతృంజయ అవతారమైన రిషబ్దేవ్జీ జైన దేవాలయాన్ని ఆయన నెలకొల్పారు. రాజ్గఢ్కు సమీపంలో ఖేడా పేరు గల ప్రాంతం కలదు. బంజారా సంచార జాతి ప్రజలు ఇక్కడ నివసిస్తుండేవారు.
పూజ్య గురుదేవులు ఈ ప్రాంతం గుండా వెళుతుండగా ఈ లోయ వద్ద ఆయన ఒక్కసారిగా నిలిచిపోయారు. తన యోగశక్తితో ఈ పర్వతంపై ఒక పుణ్యక్షేత్రం నిర్మితం కానున్నదని కనుగొన్నారు. ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే కాంతి పుంజం పూజ్య గురుదేవులకు దర్శనమిచ్చింది. రాజ్గఢ్కు తిరిగివచ్చిన అనంతరం ఖేడాకు వెళ్లి కుంకుమతో నిండిని స్వస్తిక్ ఆకారం కనిపించిన చోటును గుర్తించవలసిందిగా జిన్ లునాజీ పొర్వాల్ను ఆయన కోరారు. ఆ ప్రాంతానికి ఒక సంకేత చిహ్నాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గురుదేవులు సూచించారు.
అంతేకాక ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించవలసిందిగా లునాజీని కోరారు. తదనుగుణంగా అక్కడకు చేరుకున్న జమీదార్ లునాజీకి కుంకమతో నిండిన స్వస్తిక్ ఆకారం కనిపించింది. దాదా గురుదేవుని స్మరించుకుంటూ అతడు తవ్వడం ప్రారంభించాడు. విక్రమ్ సమ్వత్ 1940 మార్గశిర శుక్ల సప్తమి నాడు అంజన్ షలక అనంతరం రిషబ్దేవునితో సహా అందరు జైన గురువులు ప్రతిష్టించబడ్డారు. పూజ చేసిన అనంతరం ఇకపై ఈ ప్రాంతం గొప్ప పుణ్య క్షేత్రంగా పిలవబడుతుందని పూజ్య గురుదేవులు ప్రకటించారు.
|