ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆధ్యాత్మిక సుగంధాల మోహన్‌ఖేఢా తీర్థం
WD PhotoWD
సిద్ధచతో సమానమైన కీర్తిని ఈ ప్రాంతం పొందుతుంది. ఇకపై ఈ ప్రాంతం మోహన్‌ఖేడాగా పిలవబడుతుంది. సిద్ధాచల్ తీర్ద్‌కు 108 పేర్లు కలవు. వాటిలో మోహన్‌గిరి అనే పేరు కలదు. శిరస్సుపైన మణిని ధరించిన శ్వేత సర్పం ప్రపంచంలో నివసిస్తోందని చెప్పబడింది. ఇప్పటికి కూడా జైనాలయానికి వెనుక గల చిన్న దేవాలయానికి రంధ్రాలు కనిపిస్తుంటాయి. సిద్ధాచల్‌తో పాటుగా యాత్రికులు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంటారు. స్మారక దేవాలయాన్ని భక్తులు ఇక్కడ నిర్మించారు. అలాగే ప్రతి సంవత్సరం పుష్య శుద్ధి సప్తమినాడు తిరునాళ్ళ జరుగుతుంది.

ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన తిరునాళ్ళ నిర్వహించబడుతుంది. ఆరోగ్యకరమైన సంతరించుకుని ప్రశాంత పవనాలను వెదజల్లుతున్న మోహన్ ఖేడా తీర్ధం 108 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. తొలి తీర్ధంకరుడైన శ్రీ ఆదినాథ్, ఆదీశ్వర్ దాదా విగ్రహాలు సందర్శకులకు మరుపురాని అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఈ విగ్రహం మూడు ఆకృతులను సంతరించుకుంటుంది. ప్రాత:కాలమందు శిశువు ఆకృతిని, మధ్యాహ్నమందు యువకుని రూపాన్ని, సాయంకాలమందు ప్రాయంలో శాంతమూర్తి అయిన మానవాకారంలో కనిపిస్తుంది.
WD PhotoWD
విజయ్‌జీ, మునిరాజ్ పీయూష్‌చంద్ర విజయ్‌జీ తదితరుల ఆధ్వర్యంలో మోహన్‌ఖేడా తీర్ధం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

చేరుకునే మార్గం: రాజ్‌గఢ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని ఏకాంత ప్రదేశంలో తీర్థం నెలకొని ఉంది. తీర్థానికి 64 కి.మీ.ల దూరంలో మేఘ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్‌గా యాత్రికులకు అందుబాటులో ఉంది. తీర్ధానికి 112 కి.మీ.ల దూరంలో ఇండోర్ నగరం, 47 కి.మీ.ల దూరంలో పెద్ద పట్టణమైన ధార్ నగరం కలదు. బస్సులు మరియు ప్రైవేట్ వాహనాల ద్వారా యాత్రికులు తీర్థానికి చేరుకోవచ్చు.
వీడియోను వీక్షించండి
 << 1 | 2   
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
అయ్యప్ప స్వామి కోయిక్కల్ దేవాలయం  
దేవతలు కొలువుండే కైలాస పర్వతం  
ముట్టంలోని సెయింట్ మేరీస్ చర్చి  
మసీదులకే తలమానికం "తాజుల్ మసీదు"  
శక్తి పుణ్యక్షేత్రం...పావగఢ్ శక్తి పీఠం  
పద్దెనిమిది చేతుల "మహాలక్ష్మీ శ్రీ కాళీమాత"