ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందరివాడు... ఆపదమొక్కులవాడు... గోవిందుడు...
WD PhotoWD
ప్రధాన దేవాలయం:
వెంకటాద్రి పర్వతంపై శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. తరతమ బేధాలు లేకుండా అన్ని మతాలకు చెందిన వారిని గర్భగుడిలోకి అనుమతించే దేశంలోని ఏకైక దేవాలయంగా స్వామి ఆలయం సర్వజనుల పూజలను అందుకుంటోంది. పురాణాలను అనుసరించి కలియుగంలో మానవులకు ముక్తిని ప్రసాదించే కలియుగదైవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి అవతరించినట్లు చెప్పబడింది.

ఆపదలమెక్కువానికి భక్తుల మొక్కులు:
తాము తలచినది జరిగిన పక్షంలో తిరుపతి నుంచి వెంకటాద్రి పర్వతంపై గల తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తామని భక్తులు మొక్కుకుంటారు. భక్తుల మొక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అలిపిరి నుంచి తిరమలు ప్రత్యేక మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక కమిటీ వారు నిర్మించారు.

స్వామివారికి తలనీలాల సమర్పణ:
WD PhotoWD
తలనీలాలు సమర్పించుకుంటారు. దేవాలయానికి సమీపంలో గల కళ్యాణ కట్టగా పిలవబడే భారీ భవనంలో తలనీలాలను సమర్పించుకోవచ్చు. తలనీలాలు సమర్పించుకున్న అనంతరం స్నానాదికాలు కానిచ్చి భక్తులు దర్శనానికి వెళతారు.

స్వామివారి దర్శనం:
భక్తులు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి దేవస్థానం వారు నిర్వహిస్తున్న పలు దర్శన పథకాల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. దేవాలయ ప్రధాన ద్వారం నుంచి వికలాంగులు దర్శనానికి వెళ్లే అవకాశాన్ని దేవస్థాన నిర్వాహకులు కల్పించారు.
వీడియోను వీక్షించండి
<< 1 | 2 | 3  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
కలియుగ దైవం శ్రీ షిరిడీ సాయిబాబా  
ఆధ్యాత్మిక సుగంధాల మోహన్‌ఖేఢా తీర్థం  
అయ్యప్ప స్వామి కోయిక్కల్ దేవాలయం  
దేవతలు కొలువుండే కైలాస పర్వతం  
ముట్టంలోని సెయింట్ మేరీస్ చర్చి  
మసీదులకే తలమానికం "తాజుల్ మసీదు"