|
'భోజ్శాల'... సరస్వతీ మాత దేవాలయం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | చారిత్రాత్మకమైన ధార్ నగరంలో వసంత పంచమిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సరస్వతీ మాత భక్తులు పెద్దసంఖ్యలో ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవాలయం 'భోజ్శాల'కు చేరుకుంటారు. ఆ సందర్భంగా యజ్ఞయాగాదులు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతుంటాయి. పర్మార్ రాజ వంశానికి చెందిన శిల్పకళా నైపుణ్యానికి భోజ్శాల నిదర్శనంగా నిలుస్తోంది. అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య వసంత పంచమి ఉత్సవాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్నాయి.
చరిత్రను పరిశీలించినట్లయితే... ధార్ రాజ్యాధిపతి భోజ రాజు సరస్వతీ మాత భక్తుడు. భోజరాజు హయాంలో సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాజ్యంలో సామాన్య ప్రజలు సైతం సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని కలిగి ఉండేవారు. సంస్కృత భాషాధ్యయనం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ధార్ కేంద్రంగా ఉండేది. సరస్వతీ దేవి కరుణాకటాక్ష వీక్షణాలతో యోగ, సాంఖ్య, న్యాయ, జ్యోతిష, వాస్తు, రాజనీతి శాస్త్రాలలో భోజరాజు అపారమైన పాండిత్యాన్ని పొందారు. |