ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'భోజ్‌శాల'... సరస్వతీ మాత దేవాలయం
WD PhotoWD
చారిత్రాత్మకమైన ధార్ నగరంలో వసంత పంచమిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సరస్వతీ మాత భక్తులు పెద్దసంఖ్యలో ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవాలయం 'భోజ్‌శాల'కు చేరుకుంటారు. ఆ సందర్భంగా యజ్ఞయాగాదులు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతుంటాయి. పర్‌మార్ రాజ వంశానికి చెందిన శిల్పకళా నైపుణ్యానికి భోజ్‌శాల నిదర్శనంగా నిలుస్తోంది. అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య వసంత పంచమి ఉత్సవాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్నాయి.

చరిత్రను పరిశీలించినట్లయితే... ధార్ రాజ్యాధిపతి భోజ రాజు సరస్వతీ మాత భక్తుడు. భోజరాజు హయాంలో సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాజ్యంలో సామాన్య ప్రజలు సైతం సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని కలిగి ఉండేవారు. సంస్కృత భాషాధ్యయనం, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ధార్ కేంద్రంగా ఉండేది. సరస్వతీ దేవి కరుణాకటాక్ష వీక్షణాలతో యోగ, సాంఖ్య, న్యాయ, జ్యోతిష, వాస్తు, రాజనీతి శాస్త్రాలలో భోజరాజు అపారమైన పాండిత్యాన్ని పొందారు.
WD PhotoWD
ముందు నిలుపుతుంది.

శిల్పకళా వైభవం -
విశాలమైన ప్రాంతంలో చుట్టూ గోడలతో ప్రధాన హాలును కలిగి భోజ్‌శాల నిర్మితమైంది. రాతి స్థంభాల వరుస వెనుక పెద్ద ప్రార్థనామందిరం ఏర్పాటు చేయబడింది. రాతిస్థంభాల పైన భోజ్‌శాల అంతర్ నిర్మిత పై కప్పును ఆవరించి ప్రత్యేకమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. నల్లరాతిపై చెక్కబడిన రెండు శాసనాలు అక్కడ కనిపిస్తాయి. శాసనాలలో ఒక సంస్కృత నాటకం లిఖితమై ఉంది. అర్జున్ వ్రమ దేవుని పాలనలో రాజగురువు మదనుడు రాసిన రచనలను శాసనాలు కలిగి ఉన్నాయి. ప్రముఖ జైనమతవేత్త ఆశాధరుని శిష్యుడు రాజగురువు మదనుడు. ప్రతి సంవత్సరం జరిగే వసంత పంచమి ఉత్సవాలలో ఈ నాటకం ప్రదర్శించబడుతుంది.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
మరిన్ని
ప్రపంచ ప్రసిద్ధినొందిన బావన్‌గాజ జైన సిద్ధ క్షేత్రం  
అందరివాడు... ఆపదమొక్కులవాడు... గోవిందుడు...  
కలియుగ దైవం శ్రీ షిరిడీ సాయిబాబా  
ఆధ్యాత్మిక సుగంధాల మోహన్‌ఖేఢా తీర్థం  
అయ్యప్ప స్వామి కోయిక్కల్ దేవాలయం  
దేవతలు కొలువుండే కైలాస పర్వతం