|
'భోజ్శాల'... సరస్వతీ మాత దేవాలయం
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | లండన్లో వాగ్దేవి... ఒకానొకప్పుడు భోజ్శాల ఆవరణలో వాగ్దేవి (సరస్వతి) దేవాలయం ఉండేది. వాగ్దేవి నిలువెత్తు విగ్రహం భక్తులకు దర్శనమిచ్చేది. బ్రిటీష్ పాలకులు వాగ్దేవి విగ్రహాన్ని ఇంగ్లాండ్కు తరలించుకుపోయారు. వాగ్దేవి విగ్రహాన్ని ప్రస్తుతం లండన్లోని పురావస్తు ప్రదర్శనలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో వసంత పంచమి ఉత్సవ సమయంలో భక్తులు సరస్వతీ దేవి తైలవర్ణ చిత్రాన్ని పూజిస్తుంటారు.
భోజ్శాలకు గల చారిత్రక ప్రాధాన్యతను గుర్తెరిగిన భారత పురావాస్తుశాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కేవలం వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకుని సంవత్సరానికి ఒకసారి హిందువులను ఇక్కడకు అనుమతిస్తారు. అలాగే ప్రతి మంగళవారం హిందూ భక్తులు ఇక్కడకు విచ్చేసి సరస్వతి మాతను పుష్పాలు, అక్షింతలతో పూజించడానికి అనుమతించారు.
చేరుకునే మార్గం రోడ్డు ద్వారా: 60 కి.మీ.ల దూరంలో గల ఇండోర్, 62 కి.మీ.ల దూరంలో గల రట్లం నగరాల నుంచి బస్సు మరియు ట్యాక్సీల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్: ఇండోర్ (60కి.మీ), రట్లం (62 కి.మీ). సమీప విమానాశ్రయం: దేవీ అహల్య విమానాశ్రయం (60 కి.మీ).
|