|
|
|
భక్తుల కోర్కెలు తీర్చే.. పద్మావతి అమ్మవారు
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | పలు దైవ విగ్రహాలు... ఈ ఆలయంలో ఎన్నో విగ్రహాలు ఉన్నప్పటికీ.. పద్మావతీ అమ్మవారి విగ్రహమే చూడముచ్చటగా భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. శ్రీమలయప్ప స్వామి వారి సహధర్మచారిణిగా ఉన్న పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని చేతిలోవున్న తామరపై పద్మాసనంతో కొలువైవుంది. ఆమె కొలువుదీరిన స్థానం ఎంతో ప్రేమ, మర్యాదకు ప్రతీక. పద్మావతి అమ్మవారు వెలసిన ఆలయంలో మరికొన్ని దైవ విగ్రహాలు ప్రతిష్టతమై ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణ, బలరామ, సుందరరాజ స్వామి, సూర్య నారాయణ స్వామి అందమైన విగ్రహాలు కొలువై ఉన్నాయి.
ముఖ్యంగా ఈ ఆలయంలో పెరుగుతున్న ఏనుగు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ గజరాజే పద్మావతి అమ్మవారి వాహనం. తిరుచానూరులో జరిగే ఉత్సవాల్లో ఏనుగు రూపంలో ఆకారంలో వాహనాలను తయారు చేస్తారు. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న భారతావనిలో ఉన్న అనేక పుణ్య స్థలాల్లో ఒకటి తిరుచానూరు అలివేలు మంగాపురం.
ఎలా చేరుకోవాలి... | |
రైలు, రోడ్డు మార్గం ద్వారా... రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 547 కిలోమీటర్ల దూరంలో తిరుపతి పట్టణం ఉంది. అనుకూలమైన రోడ్డు, రైలు మార్గాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
విమానం మార్గం ద్వారా... హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల నుంచి తిరుపతికి వివిధ విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి.
|
|
|
|
|