ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహదేవునికి సముద్రుని జలాభిషేకం
FileFILE
తీర్థయాత్రలో భాగంగా ఈ వారం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని ఒక సముద్రతీర గ్రామంలో కొలువైవున్న మహాశివునికి స్వయంగా సముద్రుడే అభిషేకం చేయడం విశేషం. సముద్రుని రూపంలో ప్రకృతి పూజలు చేయడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? ఇది జగత్‌ మహత్మ్యం. ఆ మహత్మ్యాన్ని తెలుసుకుందాం రండి.

గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ జిల్లాలోని కవి అనే గ్రామంలో స్తంభేశ్వర మహదేవ ఆలయం నిర్మితమై ఉంది. ఈ ఆలయం సముద్రతీరానికి సమీపంలో వుంది. అమవాస్య, పౌర్ణమి రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు సంభవించే ఆటుపోట్ల కారణంగా భారీ అలలు ధాటికి సముద్రపు నీరు ఒడ్డుకు రావడం మనం చూస్తుంటాం. సముద్రతీరం అంచునే స్తంభేశ్వర ఆలయం ఉంటడం వల్ల ఆటుపోట్లకు వచ్చే సముద్రపు నీటితో ఆలయంలోని శివలింగం పూర్తిగా మునిగిపోతుంది.

ఈ అపురూప సంఘటనను ప్రకృతి అభిషేకంగా పిలుస్తారు. సముద్రుడే స్వయంగా మహాశివునికి జలాభిషేకం ప్రతి రోజు చేస్తున్నట్టుగా ఇక్కడకు వచ్చే భక్తుల
FileFILE
భావిస్తుంటారు. ప్రతి రోజు రెండు సార్లు ఈ అపురూప దృశ్యం ఇక్కడ చూడొచ్చు. ప్రకృతి సహజసిద్ధంగా ఈ అభిషేకం జరగటం వల్ల ఈ ఆలయంలోని శివలింగానికి ప్రకృతే పూజలు చేస్తుందన్న నమ్మకం భక్తులో నెలకొంది.

ఈ ప్రకృతి మహత్మ్యాన్ని కనులారా వీక్షించాలని భావించే వారు.. సంపూర్ణ భక్తిభావంతో అలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ సాక్షాత్ త్రినేత్రుడే నివశించినట్టు ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి జలాభిషేక పూజా సమయానికి ఆలయం భక్తులతో నిండిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు రెండు నేత్రాలు సరిపోవని పలువురు భక్తులు అంటుంటారు.
వీడియోను వీక్షించండి
1 | 2  >>  
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
భక్తుల కోర్కెలు తీర్చే.. పద్మావతి అమ్మవారు  
పురాతన శైవ క్షేత్రం.. సోమనాథ్ ఆలయం  
శని - షిన్‌గ్నాపూర్ శనీశ్వరాలయం  
సర్వపాపహరణం... కాశీ సందర్శనం  
మహిళల 'శబరిమల' ఆట్టుకల్ భగవతీ ఆలయం  
శక్తిదేవత తుల్జా భవానీ