ఉత్తరప్రదేశ్లో ప్రబలమైన షహజహన్పూర్లోని పరశురాముని జన్మ స్థలాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తున్నాం. జలాలాబాద్ నుంచి 30 కి.మీ దూరంలో పరశురాముని జన్మస్థలం ఉంది. వెయ్యి సంవత్సరాల పాటు అత్యంత పేరు ప్రఖ్యాతులతో వర్థిల్లిన ఈ స్థలాన్ని ప్రస్తుతం ఖేదా పరశురామపురి అని పిలువబడుతోంది. ఈ ప్రదేశంలోనే పరశురాముడు జన్మించినట్లు అక్కడి ప్రజల విశ్వాసం. ఈ స్థలాన్ని ముఖ్యమైన పర్యటక ప్రాంతంగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఈ పుణ్యస్థలాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కూడా కీలక మలుపులు తిరుగుతుంటాయి. ఇందులో విశేషమేమిటంటే... పరశురాముని శౌర్య, పరాక్రమాలు, ఆయన మహిమను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని స్థానిక బ్రాహ్మణులు తాపత్రయ పడుతారు. దీంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ముందుగా పరశురాముని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ప్రత్యేక పూజలు చేయించే అభ్యర్థులకు పూజాలు తమ దీవెనెలు అందిస్తారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ ఆలయ జీర్ణోద్ధారణ పనులు చేపట్టగా ఇవి వేగవంతంగా సాగుతున్నాయి. ఇక ఈ పుణ్యస్థల చరిత్రను పరిశీలిస్తే జలాలుద్ధీన్ చివరి కుమారుడు హబీస్ ఖాన్కు వివాహం నిశ్చయమవుతుంది. హబీస్ ఖాన్కు సతీమణిగా వచ్చే వారికి ఈ స్థలం జలాలుద్దీన్చే బహుమతిగా ఇస్తారు. దీంతో ఈ ఆలయం పరశురామపురం నుంచి జలాలాబాద్తో కలిసిపోతుంది.
|