|
కోర్కెలు తీర్చే పవిత్రమూర్తి సింగాజీ
|
 |
|
|
|
|
|
ఆదివారం, 18 మే 2008( 19:21 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | తీర్థయాత్రలో భాగంగా ఈసారి సింగాజీ మహరాజ్ దేవాలయాన్ని సందర్శిద్దాం. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్లియా గ్రామంలో కొలువై ఉన్నది. గవాలి సమాజంలో జన్మించిన సింగాజీ ఓ సామాన్యమైన వ్యక్తిత్వం కలవాడు. అయితే మన్రంగ్ స్వామివారి బోధనలతో అతని మనస్సు ఆధ్యాత్మిక చింతనవైపు పయనించింది. నిర్గుణ మార్గంలో పయనించిన సింగాజీ మాల్వా- నిమాద్ ప్రాంతంలో ప్రసిద్ధికెక్కాడు. తీర్థయాత్రలు, ఉపవాసాలపై ఆయనకు నమ్మకం లేదు. భగవంతుడు మన హృదయంలోపలే ఉంటాడని విశ్వసించాడు. ఎవరైనా తమ ఆత్మను పూర్తిగా అవలోకనం చేసుకున్నట్లయితే తీర్థయాత్రలు, ఉపవాసాల జోలికి వెళ్లరంటారు. తన కాలంలో ఆయన ఎన్నో సాంఘక సేవా కార్యక్రమాలు చేశారు. |