దక్షిణాది ప్రసిద్థమైన శైవ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. పరమేశ్వరుడు కొలువై వున్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో వున్నది. పురణాల గాధలననుసరించి శివుడు 'ఓం' మంత్రాక్షరంతో చిదంబరంలో కొలువైవున్నట్లు చెప్పబడింది. అందువల్లనే శైవులకు ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైంది. పరమేశ్వరునికి సంబంధించిన ఐదు ప్రసిద్ధ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. ఈ ఆలయాన్ని శివుని ఆకాశ క్షేత్రంగా భక్తులు పరిగణిస్తారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిని వాయువుగాను, కాంచీపురంలోని దేవాలయాన్ని పృథ్విగానూ, తిరువానికాలో వున్న ఆలయాన్ని నీరుగానూ, తిరువణ్ణామలైలో కొలువై వున్న అరుణాచలేశ్వర ఆలయం నిప్పుగానూ భావిస్తారు. ఈ దేవాలయాన్ని అగ్నిమూల ఆలయమని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దేవాలయంలో భక్తులకు పరమేశ్వరుడు ఓ జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు.
దేవాలయంలో వున్న నాలుగు అందమైన స్తంభాలు ఒక్కోటి ఒక్కో దిక్కులో వుంటాయి. దేవాలయంలోపలి భాగంలో కళానైపుణ్యం తొణకిసలాడుతుంది. ఈ దేవాలయం నాట్యానికి పుట్టినిల్లుగా గోచరిస్తుంది. ఇక్కడ వున్న ప్రతి రాయి, స్తంభంపై భరతనాట్య భంగిమలను తెలుపుతుంటాయి. ఎంతో నైపుణ్యంతో పరమేశ్వరుడు ఈ నాట్యాన్ని చేశాడనీ... అందువల్లనే ఆయనను నటరాజ స్వామిగా కీర్తించారని చెప్పబడింది.
|