పురాతన గాథల ప్రకారం ఈ చెట్టులో వీర హనుమాన్ కొలువై ఉన్నాడట. ఈ పారిజాత చెట్టుపై లెక్కలేనన్ని చిలుకలు కూర్చుని ఉంటాయి. ఒకానొక బ్రాహ్మణుడు రామచిలుకల రూపంలో అవతారం దాల్చాడని పురాణ గాథ చెబుతోంది. వీర హనుమాన్ చిలుక రూపంలోకి మారి, తులసీదాసు రాముడిని కలిసేందుకు వాహకంగా మారాడని పురాణ కథనం.
ఆలయం లోపల సీతారాములు, లక్ష్మణుడు, శివపార్వతి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం నారింజ రంగు పూతను ఆంజనేయస్వామి విగ్రహానికి పూస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆంజనేయస్వామిపై ప్రగాఢ విశ్వాసం వల్ల ఈ ఉల్టా ఆలయానికి భక్తులు విశేషంగా ఆకర్షితులవుతుంటారు.
ఈ ఆలయానికి చేరుకోవడానికి మార్గాలు: రోడ్డు మార్గంలో ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో, ఇండోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాంతానికి మీరు బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. గగన మార్గం : ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఇండోర్లో ఉంది. |